తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులకు వ్యాధి నిర్మూలనే లక్ష్యంతో శాస్త్రవేత్తలు నిరంతరం వ్యాక్సిన్ ఆవిష్కరణ లక్ష్యంగా వైద్య పరిశోధనలకు మద్దతు గా నిలుద్దాము అని అంతర్జాతీయ స్థాయిలోచాటి చెప్పే రోజు ఈ రోజు అని హెల్ప్ స్వచ్ఛంద సంస్థ పి. యు ప్రోగ్రాం మేనేజర్ బి దుర్గాప్రసాద్ పేర్కొన్నారు సోమవారం ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ప్రకాశం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ప్రకాశం జిల్లా హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణ సమీకృత వ్యూహం (దిష ) హెల్ప్ స్వచ్ఛంద సంస్థప్రాజెక్ట్ డైరెక్టర్ బివి సాగర్ ఆధ్వర్యంలోఅద్దంకి పట్టణంలోని మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు మే 18 ప్రపంచవ్యాప్తంగా హెచ్ఐవి వ్యాక్సిన్ అవగాహ కార్యక్రమం నిర్వహిస్తారని ఎయిడ్స్ వ్యాధికి కారణమయ్యే హెచ్ఐవి వైరస్ ను అడ్డుకోవటానికి ఒక సమర్ధమైన టి కాను కనుకోవలసిన అత్యవసరము అని ఈరోజు ప్రపంచ నికి గుర్తు చేసే రోజు అని, హెచ్ఐవి మహమ్మారిపై సమర్థవంతంగా పోరాడుతున్న శాస్త్రవేత్తలకు పరిశోధకులకు ఆరోగ్య కార్యకర్తలకు మరియు వాలంటీర్ల అభినందించటానికి ఈరోజు కేటాయించారని ఇది హెచ్ఐవి వ్యాక్సిన్ పరిశోధనలను మరియు ఎయిడ్స్ నిర్మూలన ముగియలేదని ప్రపంచాన్ని అప్రమత్తం చేయడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ కార్యక్రమం అని ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం హెచ్ఐవి నివారణ పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం, టీకా పరిశోధకులకు అవసరమైన అంతర్జాతీయ మద్దతు కూడగట్టడం, పరిశోధనలో నిమగ్నమైన శాస్త్రవేత్తలు ఆరోగ్య నిపుణులు శ్రమను గౌరవించడం, ప్రజారోగ్య రక్షణలో అంతర్జాతీయ భాగస్వామ్యలను పెంపొందించడం, హెచ్ఐవి మరియు ఎయిడ్స్ బాధ్యతలు పట్ల సమాజంలో ఉన్న వివక్షత తొలగించడం, పలు అంశాల పైన అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని సమాజంలో ప్రతి ఒక్కరి పై ఉంది అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో హెల్ప్ స్వచ్ఛంద సంస్థ అద్దంకి కోరిసపాడు మండలాల ఔట్రిచ్ వర్కర్లు టి దుర్గా భవాని వి మల్లేశ్వరి ఆర్ కృష్ణవేణి ఏ. ఎన్ ఎమ్ బి. విజయలక్ష్మి పి. ఈ లు పాల్గొన్నారు…..