తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
పదవ తరగతి పరీక్షా ఫలితాలలో అద్భుత ప్రతిభ కనబరిచిన సింగరాయకొండకు చెందిన గీతం స్కూల్ విద్యార్థిని షేక్ సన ను ఒంగోలులో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ గారి చేతుల మీదగా మెమొంటో మరియు అవార్డు అందజేసి ఘనంగా అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థిని సాధించిన ప్రతిభ పై ప్రశంసలు కురిపిస్తూ, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని జనార్దన్ ఆకాంక్షించారు. అనంతరం గీతం స్కూల్ చైర్మన్ లక్ష్మణ్ మాట్లాడుతూ జిల్లా స్థాయిలో గీతం స్కూల్ విద్యార్థిని ఫేక్ సన అవార్డు తీసుకోవడం చాలా గర్వకారణంగా ఉందని విద్యారంగంలో కృషి పట్టుదల మరియు నిరంతర సాధన తో మంచి ఫలితాలు సాధించడంలో మా విద్యార్థి మరోసారి నిరూపించిందని తెలిపారు.