కొమరోలు మండలం కత్తులవానిపల్లి గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున గిద్దలూరు రూరల్ సీఐ రామకోటయ్య, ఎస్సై నాగరాజు పోలీసు సిబ్బందితో.కలిసి కార్డెన్ సర్చ్ నిర్వహించారు.సరైన ధ్రువపత్రాలు లేని 25 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకొని పరిశీలించి 8 వాహనాలకు జరిమానా విధించారు.గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలంటూ ప్రజలకు అవగాహన కల్పించారు.అంతేకాకుండా దొంగతనాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించి అనుమానిత వ్యక్తులు గ్రామాలలోకి వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ రామకోటయ్య గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *